సొసైటీ,ఆదిలాబాద్:మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ప్రస్తుతం “రోబోటిక్ సర్జరీ” విధానం అందుబాటులోకి వచ్చిందని యశోద హాస్పిటల్ వైద్య నిపుణులు సునీల్ దాచేపల్లి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడారు..ఈ విధానంతో శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితత్వంతో జరిగి,రోగులు తక్కువ రోజుల్లోనే కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.పాత పద్ధతులతో పోలిస్తే రోబోటిక్ సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉండటంతో పాటు,నొప్పి కూడా తగ్గుతుందని తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం రోగులు 3 నుంచి 4 రోజుల్లోనే నడిచే స్థితికి వస్తారని వైద్యులు వెల్లడించారు.ముఖ్యంగా వృద్ధులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరమని చెప్పారు.ఈ సమావేశంలో సంజీవ్ కుమార్,గణేష్ కుమార్,నారాయణ,హేమలత,సోనాలి జోషీ తదితరులు పాల్గొన్నారు.
రోబోటిక్ సర్జరీతో మోకాలి నొప్పులకు చెక్.. -యశోద హాస్పిటల్ వైద్యుడు సునీల్ దాచేపల్లి
RELATED ARTICLES
