సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా నూతన డీఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన డా.సాధనను తెలంగాణ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ అసోసియేషన్ (టీఎంఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎంఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు నిజాముద్దీన్, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్తో పాటు సూర్యకళ,జీవన్,దేవిదాస్, అయ్యూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓకు టీఎంఎల్టీఏ ఆధ్వర్యంలో సన్మానం..
RELATED ARTICLES
