సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఈఎంటి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.108 అత్యవసర సేవలు సేవలో విధులు నిర్వహించే ఉద్యోగులంతా కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.విధుల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు సంతోషంతో తమ యొక్క అనుభవాలను పంచుకుంటూ మరింత మంచి సేవలను ప్రజలను అందించడానికి ఎప్పుడు ముందుంటామని ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి ప్రజలకు మెరుగైన ప్రథమ చికిత్సను అందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.ఈ క్రమంలో జిల్లా మేనేజర్ సూరం శేఖర్,బయ్యా సామ్రాట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 108 ఈఎంటీ డే వేడుకలు..
RELATED ARTICLES
