సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగానే 47వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా జగదీష్ అగ్రవాల్ సోమవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డు సమస్యలు పరిష్కరిస్తానని,అన్నివిధాల వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు.ప్రధానంగా కాలనీల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా.. వార్డు అభివృద్ధి ధ్యేయంగా కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అందరూ ఆశీర్వదించాలని కోరారు.47వ వార్డులోని శ్రీ రాణి సతీష్ కాలనీ,ఓల్డ్ కుమార్ పేట్,మోచిగల్లిలోని ఓటర్లందరూ బ్యాట్ గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చి కాలనీవాసులు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.
ప్రచారంలో జగదీష్ అగ్రవాల్ దూకుడు..!
RELATED ARTICLES
