20న మెడికల్ షాపుల బంద్..
సొసైటీ,ఆదిలాబాద్ : కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఔషధ విక్రయాల సడలింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు టిటిసిడిఏ, ఏఐఓసీడీ నాయకులు తెలిపారు.సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో బంద్ కరపత్రాలను సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ-ఫార్మసీలు, ఆన్లైన్ ఔషధ విక్రయాల వల్ల చిన్న మెడికల్ షాపుల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.కోవిడ్ సమయంలో అమల్లోకి తీసుకొచ్చిన G.S.R 220(E), ఈ-ఫార్మసీలకు...