దిశ కమిటీలో గాజుల సన్నీకి చోటు..
సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ లో గాజుల ప్రద్యుమ్న (సన్నీ)ను సభ్యుడిగా నియమించారు.భోరజ్ మండలం గిమ్మా గ్రామపంచాయతీ సర్పంచ్గా ఉన్న ఆయనకు సర్పంచ్ ప్రజా ప్రతినిధి కేటగిరీలో ఈ అవకాశం కల్పించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పథకాల అమలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణలో డిశా కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల...