సొసైటీ,ఆదిలాబాద్ :ఎఫ్ఆర్ఎస్ (FRS) ద్వారా విద్యార్థుల హాజరు నమోదు శాతం తక్కువగా నమోదైందనే కారణంతో హెచ్ఎంలు, మండల విద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని పీఆర్టీయూ టీజీ ఆదిలాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. నెట్వర్క్, సర్వర్, యాప్ తదితర సాంకేతిక సమస్యల కారణంగానే హాజరు నమోదు శాతం తగ్గి కనిపిస్తోందని, ఒక్కరోజు నమోదును ఆధారంగా చేసుకుని అధికారులను బాధ్యులను చేయడం సమంజసం కాదని పేర్కొంది.జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థలోని సాంకేతిక లోపాలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.