సొసైటీ,ఆదిలాబాద్ : ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని,రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బద్దం ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు యూనిఫాంలు, నాణ్యమైన భోజనం, అల్పాహార పథకాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం చేపట్టిన బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సాయి వంశీ, శివ, రేవంత్, శైలేంద్ర, క్రాంతి, అంకుశ్ తదితర ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.