societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026 Editor : Society News

డబుల్ ఇళ్ల ఎంపికలో అన్యాయం జరిగింది..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని 10వ వార్డులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితుడు భూమన్న మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని,అర్హులైన పేద కుటుంబాలకు అన్యాయం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎంపిక జాబితాపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించిన భూమన్న,అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని,అనర్హుల పేర్లు ఉంటే వాటిని తొలగించి నిజమైన అర్హులకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.