సొసైటీ,ఆదిలాబాద్ :మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8న నిర్వహించే ఆయుర్వేద గుళికల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లను నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి నేతృత్వంలో డాక్టర్ యువరాజు వైద్య కలెక్టర్, ఎస్పీలను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.శ్వాసకోశ వ్యాధుల నివారణ కోసం ఉచితంగా అందించే ఆయుర్వేద గుళికల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ క్రాస్ రోడ్ ఎదుట ఉన్న వైద్య ఆయుర్వేదిక్ రిసెర్చ్ సెంటర్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్లను కలిసి కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేశారు.