సోసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండల్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన సీఐ రహీం పాషాను కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలిశెట్టి నాగన్న మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సీఐ రహీం పాషాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొడప లింగు,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.