సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్డీవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పి.జగదీశ్వర్ రావ్ ను కాంగ్రెస్ ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న శనివారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.