societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026 Editor : Society News

ఏఎల్ఎం పాటిల్ అనిల్‌కు ఘన నివాళి..

సొసైటీ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఈ నెల 23వ తేదీన అమరుడైన భీంపూర్ మండలం కరంజీ (టీ) ఏఎల్ఎం పాటిల్ అనిల్‌కు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ బుధవారం ఘన నివాళి అర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఈ ఆఫీసులో సాయంత్రం భీంపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎలక్ట్రిసిటీ అధికారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు పాటిల్ అనిల్ చేసిన సేవలను కొనియాడారు.విధుల పట్ల ఆయన అంకితభావాన్నిగుర్తు చేసుకున్నారు.‘పాటిల్ అనిల్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.