సొసైటీ,ఆదిలాబాద్:గత 60 ఎండ్ల క్రితం మా తాత ఏనుగు ఎల్లయ్య అనాడు రైతులకు పంపకాలు చేసిన భూములే అవి అని ఏనుగు ఎల్లయ్య మనవడు ఏనుగు మోహన్ రెడ్డి అన్నారు.ఇటీవల ఇచ్చోడకు చెందిన కుంట విద్యాసాగర్ రెడ్డి బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ లో గల 150 ఏకరాలు భూదానం చేసిన ప్రచారాన్ని ఏనుగు ఎల్లయ్య మనవలు ఖండిచారు.ఈ మేరకు మీడియాతో వారు మాట్లాడారు..ఏనుగు ఎల్లయ్యకు 600 ఎకారల భూమి ఉందని బోథ్,కౌఠ,ఇచ్చోడ మండలంలోని ఆడేగాం,గిరిజం,దార్మపూరి, నవేగావ్,రాయిగూడ,చించోలి అలాగే బజార్హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ లో భూమి ఉందన్నారు.ఆ భూములు నాడే రైతులకు పంపకాలు చేయడం జరిగిందన్నారు.కానీ దీనిని విద్యాసాగర్ రెడ్డి.. తానే ఇప్పుడు భూదానం చేసినట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.ఈ సమావేశంలో ఏనుగు శేవ్వరెడ్డి,విశ్వనాథ్ రెడ్డి,మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.