సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కేమ శ్రీకాంత్ ను కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు కేమ శ్రీకాంత్ కు పూల బోకే అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష ప్రధాన,కార్యదర్శులు బింగి పోతన్న,కేమ రాజరెడ్డి,నాయకులు కేమ తిరుపతి,దైవాల శంకర్, కేమ నందు,మస్కరి పోతన్న,కేమ సదానందం,దిలీప్,అశోక్,గిజ్జ నర్సింగ్,కొకటి రాజన్న,ఆనంద్,రాజు తదితరులు పాల్గొన్నారు.