societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026 Editor : Society News

శుభకార్యాల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి..

సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా మావలలోని పద్మనాయక గార్డెన్స్ లో జరిగిన సిరిపురపు భోజరావు గారి మనుమడి నామకరణ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారితో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై వారిని ఆశీర్వదించారు.అనంతరం తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాసుల ప్రతాప్ గారి మనుమరాలి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జరగగా కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది.వారి వెంట మావల సర్పంచ్, డిసిసి ప్రధాన కార్యదర్శి ధర్మపురి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు అట్ల గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.