societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026 Editor : Society News

బడ్జెట్ లో విద్యా రంగానికి మొండిచెయ్యి..

సొసైటీ,ఆదిలాబాద్: తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం 7-8% నిధులు మాత్రమే కేటాయించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల వాగ్దానాల ప్రకారం 15% నిధులు కేటాయించకుండా,కనీస అవసరాలను కూడా విస్మరించారని,ఇది నిరుద్యోగులు మరియు విద్యార్థులకు నిరాశ కలిగించే బడ్జెట్ అని అయిన ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను విస్మరించి, ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై స్పష్టత లేదని అన్నారు.