సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ రామాలయంలో కాంగ్రెస్ నేత రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి మాధవి నాగన్న దంపతులు మరియు అనుముల విశాఖ వంశీ దంపతుల ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు.ముందుగా ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సజ్జనపు వెంకటి, గ్రామపటేల్ కొడప నారాయణ, పెద్దకాపు గంట జైరాం,మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మాజీ సర్పంచ్ కొడప లింగు, గ్రా మస్తులు పాలేపు లస్మరెడ్డి, అనుముల ఊషన్న, ఉష్కమల్ల గణేష్ పాల్గొన్నారు.
