societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026 Editor : Society News

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు..

సొసైటీ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ గారు,మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత గారు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ నాయకులు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేయడం జరిగింది. రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఆని ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి గారు, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్ గారు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ గారు, ఎంఐఎం అధ్యక్షులు నజీర్ గారు,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ గారు, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్, తొడసం దౌలత్ రావు , చిట్యాల గంగన్న సంతోష్ , కాడే సంతోష్ , కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.