ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీకి చెందిన కంటేశ్వర్ సోనాల్-రవికాంత్ దంపతుల కుమారుడు శ్రేష్ 3వ తరగతి చదువుతున్నాడు.కాగా 3 నెలల క్రితం ఆ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడటంతో ఒక కంటి చూపు కోల్పోయాడు.దీంతో ఈ పేద కుటుంబానికి జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ యాజమాన్యం అండగా నిలించింది.ఆ బాలుడి వైద్య చికిత్సల కోసం ప్రిన్సిపల్ మరియా రోజ్ రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.