సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ భారతిలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధ్రువపత్రాలు,లైసెన్స్ లను అందజేశారు.ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని కొలిపురకు చెందిన గుండెన సచిన్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా సర్వేయర్ లైసెన్సును అందుకున్నారు.ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సచిన్ కు కుటుంబీకులు,బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.