societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026 Editor : Society News

మున్సిపల్ చైర్మన్ కు టీఎన్జీవోస్ సన్మానం..

అదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బండారి అనూష సతీష్ దంపతులను టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా పక్షాన శనివారం సన్మానం చేశారు.ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా అనూషకు మిఠాయిలు తినిపించారు.ఈ సందర్బంగా టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ మాట్లాడుతూ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఎ.తీర్మల్ రెడ్డి, జిల్లా బాధ్యులు సుజాత , రాధ , టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ పట్టణ కార్యదర్శి కె.అరుణ్ కుమార్, రూరల్ యూనిట్ కార్యదర్శి ఓం ప్రసాద్, గంగాదేవి, శ్రీనివాస్, వెంకటేష్, రజనీకాంత్, కలిము , రామకృష్ణ, శ్రీధర్, వార్డెన్ సంఘం అధ్యక్షులు నర్సింలు పాల్గొన్నారు.