societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026 Editor : Society News

పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా చదవాలి.. -అసిస్టెంట్ ప్రొఫెసర్ రడాపు సంతోష్ కుమార్..

సొసైటీ న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల బోరిగామ పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రడాపు సంతోష్ కుమార్ విద్యార్థులకు ప్రేరణత్మక సందేశాన్ని ఇచ్చారు.పరీక్షలు అంటే భయపడాల్సిన పనిలేదని, ప్రణాళిక బద్ధంగా అధ్యయనం చేస్తే ఏ పరీక్షలైనా సులభంగా రాయవచ్చని సూచించారు. పుస్తకాలను అధ్యయనం చేసే విధానాన్ని, పరీక్షలు సులభంగా రాసే పద్ధతులను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రాజేష్, ఉపాధ్యాయులు ఆర్ సాంబన్న, విద్యార్థులు పాల్గొన్నారు.