ఈత పోటీల్లో తండ్రి తనయుల ప్రతిభ..
ఆదిలాబాద్ : విజయవాడ దుర్గా ఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ కృష్ణా రివర్ స్విమ్మింగ్ పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన కొమ్ము కృష్ణ, మేడిపల్లి అశోక్, కొమ్ము చరణ్ తేజ్ సత్తా చాటారు.ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ ముగ్గురిని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి,పేట సంఘం అధ్యక్షుడు పార్థసారధి, హ్యాండ్బాల్ సెక్రెటరీ హరి చరణ్ లు ప్రత్యేకంగా అభినందించారు.