societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026 Editor : Society News

బానిసత్వం వీడి.. జనసేనలో చేరా..! పడాల రవీందర్ మాధవ్

బానిసత్వం వీడి.. జనసేన పార్టీలో చేరానని పడాల రవీందర్ మాధవ్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి పాఠశాలలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న పడాల రవీందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.13 ఏళ్ల నుంచి విద్యా శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగస్థుల సమస్యలపై రాష్ట్ర,కేంద్ర స్థాయిల్లో పోరాటం చేసినా ఫలితం లేదన్నారు.దీనికి 189 మంది ప్రాణత్యాగం చేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదన్నారు.ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరానని,ప్రజాసేవ చేస్తామన్నారు.